న్యూయార్క్, సెప్టెంబర్ 11: అమెరికాలోని ప్రపంచ వాణిజ్య సంస్థపై అల్ ఖైదా వైమానిక దాడులు (9/11) జరిపి శనివారానికి 20 ఏండ్లు నిండాయి. ఈ దాడుల్లో మృతి చెందిన వారి జ్ఞాపకార్థం నిర్మించిన స్మారకం దగ్గర శనివారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్ పక్కపక్కన నిలబడి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వారి భార్యలు కూడా పాల్గొన్నారు. ‘తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను, పిల్లలను పోగొట్టుకొన్న తల్లిదండ్రులను, ఆప్తులను కోల్పోయిన అన్నదమ్ములు, అక్కాచెల్లెల్లను మేం ఎప్పటికీ మర్చిపోం’ అని బైడెన్ ట్వీట్ చేశారు.