హైదరాబాద్: కరోనా నేపథ్యంలో ఇంజినీరింగ్, ఫార్మపీ వైవా పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించాలని జేఎన్టీయూ నిర్ణయించింది. ఈ పరీక్షలను ఈనెల 24 నుంచి 30 మధ్య నిర్వహించనుంది. సంబంధిత ఎగ్జామినర్ల ప్యానెళ్లను ఈ నెల 17లోపు కాలేజీలు అప్లోడ్ చేయాలని వర్సిటీ అధికారులు ఆదేశించారు. వైవా పరీక్షలను సాయంత్రం 6.30 గంటలలోపు ముగించాలని పేర్కొన్నారు.