ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ హౌస్ ఉద్గారాల్లో 10% పశువుల నుంచే ఉత్పత్తి అవుతున్నాయి. పశువుల వ్యర్థాల్లో ఉండే అమ్మోనియా మట్టితో కలిసినప్పుడు అందులో ఉండే సూక్ష్మజీవులు రసాయనిక చర్యలు జరుపుతాయి. ఫలితంగా అది నైట్రస్ ఆక్సైడ్గా మారుతుంది. ఇది గాలి కాలుష్యానికి, భూతాపం పెరగడానికి కారణం అవుతున్నది. ఈ నేపథ్యంలో పశువులకు టాయిలెట్లు నిర్మించి వాటిలోనే విసర్జించేలా చేస్తే కాలుష్యాన్ని తగ్గించవచ్చని జర్మనీ శాస్త్రవేత్తలు ప్రయోగాలు నిర్వహించారు. ఇందుకోసం 16 ఆవులను ఎంపిక చేశారు. అవి మూత్ర విసర్జనకు ‘మూలూ’గా పిలిచే ప్రత్యేక టాయిలెట్కు వెళ్లే విధంగా శిక్షణ ఇచ్చారు. అలా వెళ్లిన వాటికి ప్రత్యేకంగా దాణా ఇచ్చి అలవాటు అయ్యేలా చేశారు.