న్యూఢిల్లీ : నోయిడాలోని ఓ గెస్ట్హౌస్లో సాగుతున్న సెక్స్ రాకెట్ గుట్టును పోలీసులు సోమవారం రట్టు చేశారు. నిందితులు ఎవరికీ అనుమానం రాకుండా నోయిడాలోని సెక్టార్ 51 ప్రాంతంలోని మూడంతస్తుల భవనంలోని గెస్ట్హౌస్లో వ్యభిచార దందా నిర్వహిస్తున్నారు. నిందితులు అంతకుముందు సెక్టార్ 18లో స్పాను నడిపేవారని పోలీసులు పేర్కొన్నారు. సెక్స్ రాకెట్ నిర్వాహకులను ఆకాష్, శివం, రమేష్, అభిషేక్, యోగేష్, ప్రమోద్, పూజా నాగ్పాల్, మిలన్ ఠాకూర్లుగా గుర్తించారు. ఈ ఏడాది ఆరంభంలో స్పాను మూసివేసిన నిందితులు గెస్ట్హౌస్లో సెక్స్ రాకెట్కు తెరలేపారు.
స్పా పేరుతోనూ వీరు వ్యభిచార దందా నిర్వహించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. స్పాను మూసివేసే క్రమంలో కస్టమర్లకు గెస్ట్హౌస్లో దందా నిర్వహిస్తున్నట్టు వీరు సమాచారం అందించారని పోలీసులు చెప్పారు. దాడుల్లో పదిమంది యువతులను కాపాడిన పోలీసులు ఘటనా స్థలం నుంచి మొబైల్ ఫోన్లు, గర్భనిరోధక మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కస్టమర్ల నుంచి వాట్సాప్ మెసేజ్లు, కాల్స్ ద్వారా బుకింగ్స్ చేసుకునేవారని పోలీసులు తెలిపారు. నిర్వాహకులతో పాటు ఢిల్లీ, ఎన్సీఆర్కు చెందిన పది మంది కస్టమర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.