కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత అక్కడి పౌరులు (Afghan citizens) ఇప్పుడు కొత్త ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్ వశం చేసుకోవడంతో పెద్ద సంఖ్యలో ఆఫ్ఘన్ పౌరులు ఇప్పటికే దేశం విడిచి పారిపోయారు. ఇప్పటికీ మరో దేశానికి వెళ్లి తల దాచుకునేందుకు వేలాది మంది ఆఫ్ఘన్ పౌరులు పాక్-ఇరాన్ సరిహద్దుకు చేరుకుంటున్నారు. కాబూల్ విమానాశ్రయాన్ని తాలిబాన్ తమ ఆధీనంలోకి తీసుకొని తరలింపు ఆపరేషన్ను నిలిపివేయడంతో సరిహద్దు వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. వీనే దేశం నుంచి బయటకు వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తున్నారు.
ఎయిర్ ఎగ్జిట్ పరిస్థితులు మూతపడిన తర్వాత ప్రజలు ఇప్పుడు పాకిస్తాన్గానీ, ఇరాన్కుగానీ వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఇరాన్-పాకిస్తాన్ సరిహద్దుకు చేరుకుంటుండటంతో.. ఈ దేశాలు తమ సరిహద్దుల వద్ద భద్రతను కఠినతరం చేశాయి. ఆఫ్ఘన్ పౌరులెవరూ సరిహద్దు దాటడానికి అనుమతించడం లేదు. ఆఫ్ఘనిస్తాన్తో మధ్య ఆసియా దేశాల సరిహద్దులో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. పాకిస్తాన్ లోని టోర్ఖామ్ సరిహద్దు వద్ద వేలాది మంది ప్రజలు పాకిస్తాన్ లోనికి ప్రవేశించడానికి వేచి ఉన్నారని ఒక అధికారి తెలిపారు. ఇరాన్ ఇస్లాం కలాన్ సరిహద్దులో వేలాది మంది ఆఫ్ఘన్ పౌరులు చేరుకున్నారు. ఇక్కడి నుంచి కొందరు ఇరాన్లోని వెళ్లడంలో విజయం సాధించారు. ఇదే సమయంలో దేశ అంతర్గత పరిస్థితులు కూడా విషమించాయి. బ్యాంకుల్లో నగదు కొరత ఏర్పడింది. దాంతో ఆహార సంక్షోభం, ద్రవ్యోల్బణం మధ్య బ్యాంకుల వద్ద భారీ రద్దీ ఏర్పడింది.
ప్రభుపాద స్వామి నిజమైన దేశభక్తుడు : మోదీ
బంగారు వడ పావ్ కావాలా? ఎక్కడ దొరుకుతుందంటే..!
బలగాలను ఎందుకు ఉపసంహరించారు? : యూఎస్ ఎంపీ రాజా కృష్ణమూర్తి
టీ20 వరల్డ్ కప్ ఆడను : బంగ్లా ఓపెనర్ తమీమ్ ఇక్బాల్
పనిదినాల్లో ఆన్లైన్ గేమ్స్ ఆడారో.. రంగు పడుద్ది..!
పీఎన్బీ ఫెస్టీవ్ ఆఫర్స్.. రుణాలపై అన్ని ఛార్జీల మినహాయింపు
లడఖ్లో అందుబాటులోకి ప్రపంచంలో ఎత్తైన రహదారి
ఆఫ్ఘన్లో మూతపడిన థియేటర్లు.. నష్టాల్లో బాలీవుడ్ సినిమా
పోలాండ్పై హిట్లర్ దాడి.. సుదీర్ఘ యుద్ధానికి అంకురార్పణ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..