జనగామ రూరల్, మే 11 : కరోనాతో అల్లడుతున్న ప్రజలకు అండగా ఉంటామని, పాజిటివ్ వచ్చిన వారు ఇంట్లోనే ఉండాలని సర్పంచ్ అంబాల ఆంజనేయులు, ఉప సర్పంచ్ చినబోయిన రేఖారాజు కోరారు. మంగళవారం మండలంలోని పెంబర్తిలో కరోనా బాధితుల ఇళ్లకు వారు వెళ్లి పలు సూచనలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేస్తామని చెప్పా రు. వైరస్ నియంత్రణకు గ్రామంలో ఇప్పటికే సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశామని ప్రతిరోజు బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నామన్నారు. ప్రతి రోజూ కరోనా బాధితులతో మాట్లాడి వారికి అవసరమైన చేయూతిస్తున్నట్లు వారు వివరించారు. ప్రతి ఒక్కరూ స్వీయనియంత్రణ పాటించాలని, మాస్క్ ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రపుల్ రెడ్డి పాల్గొన్నారు.
నిత్యావసర సరుకుల పంపిణీ
కరోనా బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు మత్య్స సంఘం రాష్ట్ర నాయకుడు పంపర మల్లేశం తెలిపారు. మంగళవారం పెంబర్తిలో బాధితులకు తనవంతు సాయం చేశానని ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట పీఏసీఎస్ డైరెక్టర్ బంగిమఠం నాగభూషనం, వార్డు సభ్యులు గోనెల సుధాకర్, సంకటి యాదగిరి, నాయకులు పంపర హరీశ్, సంకటి నర్సయ్య, బొడ్డు వెంకటేశ్, అయిలా భాస్కరాచారి, అంబాల శ్రీనివాస్, బైరి బాలరాజు, సంకటి రాజు, పాల్గొన్నారు.
కరోనా బాధితులకు ఆర్ధికసాయం
మండలంలోని పలు గ్రామాలకు చెందిన కరోనా బాధితులకు జడ్పీటీసీ పల్లా భార్గవిరెడ్డి బాసటగా నిలిచారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపుమేర మంగళవారం రూ.లక్ష ఆర్థిక సాయం చేయడంతో పాటు ఆయా గ్రామాల్లో కరోనా బాధితులకు నిత్యావసర వస్తువులు, పాలు, పండ్లు, డ్రైఫ్రూట్స్ అందిస్తున్నట్లు వివరించారు. కడవెండిలో 76 మంది రోగులకు సోమవారం స్థానిక సర్పంచ్ బెత్లినారెడ్డి సరుకులు అందించగా, మంగళవారం ధర్మాపురంలో సర్పంచ్ బజ్జూరి అశోక్, కామారెడ్డిగూడెంలో టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు చింత రవి నేతృత్వంలో 26 మంది రోగులకు సరుకులు అందించామని భార్గవిరెడ్డి తెలిపారు. కరోనా కష్టకాలంలో బాధితులకు తమవంతు చేయూతనిస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కె ట్ కమిటీ వైస్ చైర్మన్ కృష్ణమూర్తి, చిరంజీవి, గుండె రమేశ్ పాల్గొన్నారు.