నిర్మల్ అర్బన్ : నిర్మల్ పట్టణం గాజుల్ పేట్ నుంచి ఆలూర్ గ్రామం వరకు రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించనున్న డబుల్ రోడ్డు పనులను గురువారం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గాజుల్ పేట్ చౌరస్తా వద్ద ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రం ఏర్పడిన తరువాత పట్టణంలో మూడు సమస్యలు ఉండేవన్నారు. కడ్తాల్ నుంచి సోఫీ నగర్ వరకు రూ. 4 కోట్లతో డివైడర్, రహదారి మరమ్మతులు నిర్మాణం చేపడుతున్నామన్నారు. అలాగే సరస్వతి కెనాల్ బ్రిడ్జి వెడల్పు చేయనున్నామని తెలిపారు.
గాజుల్ పేట్ చౌరస్తా నుంచి గాజుల్ పేట్, లంగ్డాపూర్, వెంగ్వాపేట్ మీదుగా ఆలూర్ వరకు రహదారి కోసం రూ. 4 కోట్లు మంజూరు చేశామని మొదటగా డ్రైనేజీ పనులు పూర్తి చేసి రహదారి పనులు ప్రారంభిస్తామని అన్నారు.
యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించినట్లు తెలిపారు.
ఆలూర్ వరకు డబుల్ రోడ్డు వేసి మధ్యలో డివైడర్ ఏర్పాటు చేసి లైట్లు పెట్టనున్నామని తెలిపారు. అనంతరం రాంరావ్ బాగ్లో జౌళి నాళా పూడికతీత పనులను ప్రారంభించారు.