హైదరాబాద్ : త్రీ స్టార్.. ఫైవ్ స్టార్.. మనం ఫ్రిడ్జ్లు కొనేముందుకు ఇవన్నీ చూస్తుంటాం. కరెంటు బిల్లును ఆదా చేసేందుకు ఆ రకమైన ఫ్రిడ్జ్లను వాడుతుంటాం. కానీ మీరు చూస్తోంది గ్రౌండ్ ఫ్రిడ్జ్. దీనికి అసలు విద్యుత్తే అవసరం లేదు. స్వచ్ఛమైన పర్యావరణాన్ని కోరుకునేవారికి ఈ ఫ్రిడ్జ్ చాలా అనుకూలంగా ఉంటుంది. భూమిలోపల ఉండే ఈ ఫ్రిడ్జ్ కోసం ఓ సొరంగాన్ని తొవ్వాల్సి ఉంటుంది. డచ్ కంపెనీ ఇలాంటి ఫ్రిడ్జ్లను తయారు చేస్తున్నది. దీని ధర మన కరెన్సీలో 15 లక్షలుగా ఉంది. గ్రౌండ్ఫ్రిడ్జ్ పేరుతో దీన్ని మార్కెట్లోకి రిలీజ్ చేశారు. మద్యం సీసాలు, కూరగాయలు, పండ్లు వీటిలో స్టోర్ చేసుకోవచ్చు. దీని కెపాసిటీ 3 వేల లీటర్లు ఉన్నట్లు ఆ కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఒకరకంగా ఇది 20 కుటుంబాలకు కలిసి వచ్చే రీతిలో పనిచేస్తుంది. గ్రౌండ్ఫ్రిడ్జ్ ఇంటీరియర్ లో వైట్ పెయింట్ వేశారు. దీని వల్ల దాంట్లో లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది.
ఇక ఆ ఫ్రిడ్జ్కు బయట మాత్రం గ్రీన్ కలర్ వేశారు. దీని వల్ల ఆ ఫ్రిడ్జ్ గార్డెన్లో కలిసిపోయినట్లుగా దర్శనమిస్తుంది. భారీ గోళాకారంలో ఉన్న ఫ్రిడ్జ్లో నాలుగు షెల్వ్స్ ఉన్నాయి. వాటిల్లో ఆహారాన్ని స్టోర్ చేసుకోవచ్చు. అయితే బయట తగిలే సూర్యరశ్మి వల్ల.. ఫ్రిడ్జ్లో లోపల టెంపరేచర్లు మారుతుంటాయి. నేల రకం, గ్రౌండ్వాటర్ వల్ల కూడా ఫ్రిడ్జ్ పనితీరు మారుతుంది. భూమి లోపల ఫ్రిడ్జ్కు చల్లటి గాలిని అందించేందుకు దానికి బ్యాటరీలను అమర్చారు. ఫ్రిడ్జ్ లోపల 50 డిగ్రీల ఫారెన్హీట్ టెంపరేచర్ ఉంటుంది. ఇక ఈ ఫ్రిడ్జ్ను ఇన్స్టాల్ చేయాలనుకుంటే.. కనీసం ఏడు అడుగుల లోతు.. 8×8 అడుగులు వెడల్పు తొవ్వాల్సి ఉంటుంది. మీకు గార్డెన్ ఉంటే.. ఈ ఫ్రిడ్జ్ ట్రై చేయండి.