నాగర్కర్నూల్ : శ్రీశైల భ్రమరాంబికా, మల్లికార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ఠమైన నిఘా మధ్య ఆలయ సిబ్బందితో ఉభయ దేవాలయాల హుండీ లెక్కింపు చేపట్టారు. 61 రోజులుగా భక్తులు చెల్లించిన మొక్కులు, కానుకలు నగదు రూపంలో రూ.61,19,628 ఆదాయంగా వచ్చినట్లు ఈవో కేఎస్ రామారావు తెలిపారు. వీటితోపాటు 82 గ్రాముల బంగారం, 940 గ్రాముల వెండి ఆభరణాలు, 365 ఇంగ్లాండ్ పౌండ్స్, 50 యూఏఈ దిర్హమ్స్, 5 యూరోస్, 1 యూఎస్ఏ డాలర్ను భక్తులు సమర్పించారు.
ఇవి కూడా చదవండి..
మోడల్ స్కూళ్లు అధునాతన దేవాలయాలు
కార్మికులకు అండగా నిలిచిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
భూమికి బరువయ్యేంత పంట పండిస్తాం : మంత్రి హరీశ్ రావు
దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్ల పంపిణీ
ఎంపీ వెంకటేష్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత
ఐసోలేషన్ సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్