ముంబై/న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: అది ముంబైలోని వాంగణీ రైల్వే స్టేషన్.. ప్లాట్ఫాం అంచు దగ్గర్లో తల్లితో కలిసి నడుస్తున్న బాలుడు అదపు తప్పి పట్టాలపై పడిపోయాడు. అదే సమయంలో అటువైపుగా ఓ రైలు దూసుకొస్తున్నది. ఆ బాలుడు ప్లాట్ఫాంపైకి ఎక్కడానికి విఫలయత్నం చేశాడు. సరిగ్గా అప్పుడే రైల్వే పాయింట్స్మెన్ మయూర్ షెల్కే పట్టాలపై రైలుకి ఎదురుగా పరిగెడుతూ వచ్చాడు. ఒక్క ఉదుటున బాలుడిని ఎత్తుకుని ప్లాట్ఫాంపైకి విసిరేశాడు. అతను కూడా ప్లాట్ఫైంకి ఎక్కేశాడు. ప్రాణాలకు తెగించి బాలుడిని షెల్కే కాపాడిన దృశ్యం సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. షెల్కే సాహసాన్ని కొనియాడుతూ ఆ వీడియోను రైల్వే మంత్రి పీయూష్ గోయల్ షేర్ చేశారు.