పాట్నా: కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు సాయం ప్రకటించింది బీహార్ ప్రభుత్వం. ఈ మేరకు బాల్ సహాయతా యోజనా పేరుతో ఆదివారం ఓ కొత్త పథకాన్ని ప్రారంభించినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ పథకంలో భాగంగా కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు నెలకు రూ.1500 ఆర్థిక సాయం ఇవ్వనున్నారు. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు కొవిడ్తో చనిపోయినా ఈ పథకం వర్తించనుంది. వారి పిల్లలకు 18 ఏళ్ల వయసు వచ్చే వరకూ నెలకు ఈ రూ.1500 సాయం అందించనున్నట్లు నితీష్ ట్వీట్లో వెల్లడించారు.