వేములవాడ టౌన్ : వేములవాడ రాజన్నకు ఓ రిటైర్డ్ టీచర్ ఓ విలువైన కానుకనిచ్చి భక్తిభావాన్ని చాటుకున్నాడు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన ఆకుల రామదాసు దంపతులు 860 గ్రాముల (సుమారు రూ. 62 వేల విలువైన) వెండిపళ్లాన్ని బహూకరించారు. ఆలయ ఆవరణలో బుధవారం ఏఈవో సంకేపల్లి హరికిషన్కు అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనతో ప్రత్యేక పూజలు చేయించి ఆశీర్వచనం చేశారు.