బీజింగ్: అమెరికా కళ్లు గప్పి భూగోళాన్నంతా చుట్టి వచ్చే హైపర్సోనిక్ మిస్సైల్ను చైనా పరీక్షించిందన్న వార్త సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని చైనా సోమవారం వెల్లడించింది. గత జులై నెలలో తాము ఓ స్పేస్ వెహికిల్ను పరీక్షించామని, అది హైపర్సోనిక్ మిస్సైల్ కాదని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్ వెల్లడించారు. బీజింగ్లో సోమవారం నిర్వహించిన ప్రెస్ బ్రీఫ్లో ఝావో ఈ మిస్సైల్ వార్తలపై స్పందించారు. అమెరికాకు తెలియకుండా ఈ ఏడాది జులైలో చైనా హైపర్సోనిక్ మిస్సైల్ను పరీక్షించిందని ఫైనాన్షియల్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే.