యాదాద్రి భువనగిరి : తాటిచెట్టు పైనుంచి జారిపడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం రాయిపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
రాయిపల్లికి చెందిన నల్లమాస అశోక్(35) గీత కార్మికుడు. రోజువారీగా సాయంత్రం కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కాడు. ఈదురుగాలి వీయడంతో పట్టుకోల్పోయి చెట్టు పైనుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు.
స్థానికులు బాధితుడిని చికిత్స నిమిత్తం హుటాహుటిన భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.