బ్యాంకాక్: కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో కొవిడ్ నిబంధన విషయంలో థాయ్లాండ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నది. అందులో భాగంగానే మాస్క్లు లేకుండా బయట తిరిగే వారికి 20 వేల భట్లను (భారత కరెన్సీలో రూ.47 వేలు) జరిమానాగా విధించాలని నిర్ణయించింది. నిన్నటి (సోమవారం) నుంచే ఈ నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. అయితే, స్వయంగా థాయ్లాండ్ ప్రధాని ప్రయుత్ చాన్ ఓచా తొలిరోజే ఈ నిబంధనను ఉల్లంఘించారు. దాంతో అధికారులు ఆయనకు జరిమానా విధించారు.
వివరాల్లోకి వెళ్తే.. కొవిడ్-19 వ్యాక్సినేషన్పై సోమవారం జరిగిన సమావేశానికి థాయ్ ప్రధాని ప్రయుత్ చాన్ ఓచా హాజరయ్యారు. అయితే ఆ సమావేశానికి హాజరైన ఇతరులంతా మాస్కులు పెట్టుకున్నారు గానీ, ప్రధాని ఓచా ఒక్కరే మాస్కు లేకుండా కనిపించారు. ఈ విషయంపై ప్రత్యర్థి పార్టీలతోపాటు ప్రజల నుంచి విమర్శలు రావడంతో అధికారులు ఆయనకు జరిమానా వేశారు. అయితే, ప్రధానిది తొలి ఉల్లంఘన కాబట్టి ఆరు వేల భట్లను (దాదాపు రూ.14,250) జరిమానాగా వసూలు చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
పడకగదిలో దూరిన కోడె నాగు..వీడియో
ఆస్పత్రిలో గొడవ.. డాక్టర్ను చెంపదెబ్బ కొట్టిన నర్సు, నర్సుపై డాక్టర్ దాడి.. వీడియో
యూకే నుంచి భారత్కు ప్రాణాధార వైద్య సామాగ్రి: కేంద్రం
క్యాన్సర్ రోగులు టీకా వేసుకోవచ్చు
25 మిలియన్ల ప్రేమను పొందిన లాహే లాహే సాంగ్
కరోనా వేళ భారత్కు బాసటగా నిలిచిన ఫ్రాన్స్, కువైట్
పదిమందిలో కలవొద్దు.. బాతఖానీ పెట్టొద్దు..