ధన్వాడ, ఏప్రిల్ 26: మండలంలోని కంసాన్పల్లిలో సోమవారం బీరప్ప బండారోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఐదేండ్లకోసారి నిర్వహించే బండారోత్సవానికి వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తిశ్రద్ధలతో బండారు చల్లారు. బీజేపీ రాష్ట్ర నాయకులు నాగురావు నామాజీ, రతంగ్పాండురెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ పి.రాంచంద్రయ్య, ఎంపీటీసీ గోవర్ధన్గౌడ్, సర్పంచ్ ఆశప్ప, మాజీ ఎంపీటీసీ మల్లయ్య, నాయకులు బీరప్పను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు నాగూరావు, రతంగ్ పాండురెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు, భక్తు లు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
కరోనాతో ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు కన్నుమూత
కరోనా రియల్ డాటా ఇవ్వలేరా?: రాహుల్ గాంధీ