కరోనా, ఇతర కారణాలతో 18 మంది మృతి
హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనావ్యాప్తి మరింత ఎక్కువవుతున్నది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా రికార్డుస్థాయిలో 5,926 కేసులు నమోదయ్యాయి. ఈ ఒక్కరోజే కరోనా, ఇతర కారణాలతో 18 మంది మరణించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు 800కు చేరువవగా, శివారు జిల్లాలతోపాటు నిజామాబాద్లో ఉధృతి కొనసాగుతున్నది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 1.22 లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. మరోవైపు 2,209 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 42,853 చికిత్స పొందుతున్నారు. సోమవారం అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 793 కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరి 488, రంగారెడ్డి 455, నిజామాబాద్ 444, కామారెడ్డి 262, ఖమ్మం 247, వరంగల్ అర్బన్ 208, జగిత్యాలలో 205 కేసులు వెలుగు చూశాయి.
సోమవారం రాష్ట్రంలో నమోదైన కరోనా కేసులు
వివరాలు సోమవారం మొత్తం
పాజిటివ్ కేసులు 5,926 ,61,359
డిశ్చార్జి అయినవారు 2,209 3,16,650
మరణాలు 18 1,856
చికిత్స పొందుతున్నవారు — 42,853