కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) మాజీ ఉపాధ్యక్షుడు అబ్దుల్ రషీద్ దోస్తుమ్ కుమారుడిని తాలిబాన్ ఉగ్రవాదులు అపహరించారు. ఆయను బుధవారం సాయంత్రం జవాజాన్ విమానాశ్రయం నుంచి కిడ్నాప్ చేశారు. కొందరు ఆఫ్ఘన్ సైనికులను కూడా తమ ఖైదీలుగా తీసుకువెళ్లినట్లు సమాచారం అందింది. అయితే, ఈ ఘటనను తాలిబాన్ లేదా ఆఫ్ఘన్ ప్రభుత్వం ధ్రువీకరించ లేదు.
దోస్తుమ్ కుమారుడిని తాలిబాన్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేయడం ఆఫ్ఘన్ ప్రభుత్వానికి పెద్ద దెబ్బ. దోస్తుమ్ ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లో ప్రముఖ నాయకుడిగా ఉన్నారు. అతను 1990 లలో ఆఫ్ఘనిస్తాన్లో ఉత్తర కూటమిని స్థాపించి రాజకీయంగా ఎదిగారు. ఆఫ్ఘనిస్తాన్ ఇస్లామిక్ ఎమిరేట్ సంస్థ కాబూల్ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఆఫ్ఘనిస్తాన్ విముక్తి కోసం ఈ కూటమిని ఏర్పాటుచేశారు. దీని అధికారిక పేరు యునైటెడ్ ఇస్లామిక్ ఫ్రంట్.
బుధవారం ఉదయం మజారే షరీఫ్ నగరాన్ని అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ సందర్శించారు. అక్కడ మాజీ ఉపాధ్యక్షుడు అబ్దుల్ రషీద్ దోస్తుమ్, బాల్ఖ్ మాజీ గవర్నర్ అలా ముహమ్మద్ నూర్తో పాటు మరికొందరు నాయకులతో భేటీ అయ్యారు. అక్కడి పరిస్థితులను సమీక్షించారు. ఘనీ వెళ్లిపోయిన కొద్దిసేపటికే దోస్తుమ్ కుమారుడు కిడ్నాప్నకు గురవడం కలకలం రేపింది. 2014 నుంచి ఆరేండ్లపాటు ఆఫ్ఘాన్ ఉపాధ్యక్షుడిగా కొనసాగిన దోస్తుమ్ అమెరికా అనుకూలుడిగా ముద్ర ఉన్నది. 9/11 దాడుల అనంతరం ఆఫ్ఘన్లో తాలిబాన్ ప్రభుత్వాన్ని పడగొట్టడంలో అమెరికా మిలటరీకి సాయమందించడంలో దోస్తుమ్ కీలక పాత్ర పోషించాడని భావిస్తున్నారు. టర్కీలో చికిత్స పొంది ఇటీవలనే కుటుంబంతో పాటు దోస్తుమ్ ఆఫ్ఘనిస్తాన్ వచ్చాడు.
ఈ హీరో రాకతో ఎగిరి గంతేసిన మీరాబాయి చాను.. ఎవరా హీరో తెలుసా?
ఒలింపిక్స్లో భారత్కు తొలి బంగారు పతకం.. ఏదంటే..?
ఐసీసీ ర్యాంకింగ్స్లో పైకి బుమ్రా.. కిందికి కోహ్లీ
కూరగాయలను సబ్బుతో కడుగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి..
ఇవి ఎకో ఫ్రెండ్లీ బూట్లు.. ఉత్పత్తి ఎక్కడో తెలుసా..?
డయాబెటిస్ను ఇలా కూడా ముందే గుర్తించొచ్చు..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..