కాబూల్: తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ చేరుకొన్నారు. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ ప్రభుత్వం ఏర్పాటుకు జిహాదీ, రాజకీయ నేతలను బరాదర్ కలవనున్నట్టు తాలిబన్ ప్రతినిధి చెప్పారు. దోహాలోని తాలిబన్ల రాజకీయ కార్యాలయానికి కూడా చీఫ్ అయిన బరాదర్ మంగళవారమే అఫ్గానిస్థాన్ వచ్చారు. ప్రస్తుతం తాలిబన్ నేతల్లో అత్యంత సీనియర్ బరాదరే.