కాబూల్: ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్లో తాలిబన్లు ఓ చెక్పోస్టును ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడ పాకిస్థాన్ కరెన్సీకి చెందిన సుమారు మూడు బిలియన్ల రూపాయల నోట్ల కట్టలను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. కాందహార్లో ఉన్న స్పిన్ బోల్డక్ ఏరియాలోని ఆఫ్ఘన్ దళాలు ఆ చెక్ పోస్టులో ఉన్నారు. స్మగ్లర్ల నుంచి ఆఫ్ఘన్ అధికారులు లంచాల రూపంలో ఆ మొత్తాన్ని సేకరించి ఉంటారని భావిస్తున్నారు. పాకిస్థాన్తో ఉన్న స్పిన్ బోల్డక్ సరిహద్దు వద్ద బుధవారం తాలిబన్లు చెక్పోస్టును ముట్టడించారు. కాందహార్లోని వెష్ అనే బోర్డర్ పట్టణాన్ని కూడా ముట్టడించినట్లు తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ పేర్కొన్నారు.