న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ అత్యల్పంగా సాగుతోందని, అక్కడ నకిలీ వ్యాక్సినేషన్ కేంద్రాలు నడుస్తున్నాయని నడ్డా మండిపడ్డారు. వ్యాక్సినేషన్పై దీదీ రోజూ తన వైఖరి మార్చుకుంటున్నారని దుయ్యబట్టారు.
రాష్ట్రాలకు ఉచితంగా కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్లు అందిస్తున్నా ఈ ప్రక్రియలో బెంగాల్ విఫలమైందని ఆరోపించారు. బూటకపు వ్యాక్సినేషన్ను మనం ఎక్కడా వినలేదని, కేవలం బెంగాల్లోనే అది సాధ్యమని ఎద్దేవా చేశారు. బెంగాల్లో పద్ధతి ప్రకారం ఎన్నికల అనంతర హింస చోటుచేసుకుంటోందని ఆరోపించారు. మహిళా సీఎం ఉన్న రాష్ట్రంలో మహిళలపై వేధింపులు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.