జగిత్యాల జిల్లా వాసి ఘనత
మెట్పల్లి రూరల్, జూన్ 6: అమెరికా దేశం జార్జియా రాష్ట్రంలోని అత్యంత ఎత్తయిన బ్రాస్టౌన్ బాల్డ్ పర్వతంపై జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన మరిపెల్లి ప్రవీణ్ అక్కడి కాలమానం ప్రకారం సూర్యనమస్కారాలు చేశారు. ఎత్తయిన పర్వతాలను అధిరోహిస్తూ, అక్కడి అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద సూర్య నమస్కారాలు చేస్తూ ప్రవీణ్ యోగా శక్తిని ప్రపంచానికి చాటిచెబుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం బ్రాస్టౌన్ బాల్డ్ పర్వతంపై 1,458 అడుగుల ఎత్తులో 29 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 108 సూర్య నమస్కారాలను 23.18 నిమిషాల్లో పూర్తి చేశారు. ఈయన ఇప్పటివరకు 13 ఎత్తయిన పర్వతాలను అధిరోహించి 108 సూర్య నమస్కారాలు చేశారు.