విశేష జనాదరణ పొందిన అంకెల పజిల్
టోక్యో: ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న ప్రసిద్ధ జపనీస్ పజిల్ సుడోకు సృష్టికర్త మాకి కాజీ (69) క్యాన్సర్ తో ఆగస్టు 10న టోక్యోలో కన్నుమూశారు. ఆయన స్థాపించిన నికోలి కంపెనీ మంగళవారం ఈ సంగతి వెల్లడించింది. గాడ్ ఫాదర్ ఆఫ్ సుడోకుగా పేరొందిన కాజీ పిల్లలకు, పెద్దలకు సులభంగా ఉండాలనే లక్ష్యంతో 1983లో సుడోకును రూపొందించారు. ఒకటి, సంఖ్య అనే జపాన్ మాటలను కలిపి పజిల్కు సుడోకు అనే పేరు పెట్టారు. ఆక్స్ఫర్డ్ డిక్షనరీలోకి ఆ పదం ప్రవేశించడం విశేషం. 1 నుంచి 9 వరకు అంకెలతో పజిల్ను నింపడం ఆ పజిల్ ప్రత్యేకత. నికోలి కంపెనీ ద్వారా పజిల్ను మార్కెటింగ్ చేసేవారు. దేశదేశాల్లోని పత్రికలు ఈ పజిల్ను ప్రచురిస్తున్నాయి. తన పజిల్ను ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు కాజీ 30కి పైగా దేశాల్లో పర్యటించారు.