సిద్దిపేట : సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన లబ్ధిదారులకు స్థానిక కొండా భూదేవి గార్డెన్స్లో సోమవారం మంత్రి హరీశ్ రావు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏండ్లుగా ఇళ్ల పట్టాలు లేనివారికి భద్రత కల్పిస్తూ పట్టాలు అందించామని తెలిపారు.
కరోనా విజృంభిస్తున్నందున ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 45 ఏండ్లు దాటినా వారు కొవిడ్ టీకా తీసుకోవాలని కోరారు.
తడి, పొడి చెత్తను వేరుచేసి మున్సిపల్ వాహనానికి ఇవ్వాలన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీని స్వచ్ఛతకు చిహ్నంగా నిలపాలని సూచించారు.
ప్రభుత్వ దవాఖానలో అన్నిసదుపాయాలున్నాయని, సేవలను వినియోగించుకోవాలన్నారు. కోమటి చెరువు వద్ద మూడు రోజుల పాటు లేక్ ఫెస్టివల్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, సుడా డైరెక్టర్లు బర్ల మల్లికార్జున్, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, తాసిల్దార్ విజయ్, డిప్యూటీ తాసిల్దార్ రాజేశం, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి