న్యూఢిల్లీ : చమురు ధరలు మళ్లీ పెరిగాయి. రెండు రోజుల విరామం అనంతరం ధరలు మళ్లీ పైకి కదిలాయి. గత నెలలో 16 సార్లు పెరగ్గా.. జూన్లో రెండోసారి చమురు కంపెనీలు ధరలు పెంచాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఇంధన ధరలు ఆల్టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. తాజాగా లీటర్ పెట్రోల్పై 27 పైసలు, డీజిల్పై 30 పైసల వరకూ పెంచాయి. కొత్తగా పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76, డీజిల్ లీటర్కు రూ.85.66కు పెరిగింది.
ముంబైలో ముంబైలో పెట్రోల్ రూ.100.98, డీజిల్ రూ.92.99కు చేరింది. ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్లోని చాలా చోట్ల పెట్రోల్ ధర రూ.104కు చేరింది. మే నుంచి ఇప్పటి వరకు 18 రోజుల్లో ధరలు పెరగ్గా.. పెట్రోల్పై రూ.4.36, డీజిల్పై రూ.4.93 పెరిగింది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర వందకు చేరువవుతుండగా.. ఆంధ్రప్రదేశ్లో దాదాపు అన్ని ముఖ్యనగరాల్లో లీటర్ పెట్రోల్ ధర వంద మార్క్ను దాటింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్లోని దాదాపు అన్ని నగరాల్లోనూ దాదాపు రూ.105కు చేరువైంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు ఇలా
ఢిల్లీలో పెట్రోల్ రూ.94.76.. డీజిల్ రూ.85.66
ముంబైలో పెట్రోల్ రూ.100.98.. డీజిల్ రూ.92.99
చెన్నైలో పెట్రోల్ రూ.96.23.. డీజిల్ రూ.90.38
కోల్కతాలో పెట్రోల్ రూ.94.76.. డీజిల్ 88.51
హైదరాబాద్లో పెట్రోల్ రూ.98.48, డీజిల్ రూ.93.38
జైపూర్లో పెట్రోల్ రూ.100.94, డీజిల్ రూ.94.16
విజయవాడలో పెట్రోల్ రూ.100.98, డీజిల్ రూ.95.19
పాట్నాలో పెట్రోల్ రూ.96.90, డీజిల్ రూ.90.94