ఓ తెలుగు సినిమా యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో కథానాయిక రాయ్లక్ష్మీ ప్రమాదానికిగురైంది. ఆమె స్వల్ప గాయాలతో బయటపడిందని చిత్రబృందం తెలిపింది. రాయ్లక్ష్మీ కథానాయికగా రోచిశ్రీ మూవీస్ నిర్మాణంలో రమణ మొగిలి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో ప్రారంభమైంది. రాయలక్ష్మీ, ప్రదీప్రావత్, సురేష్ సహ 18 మంది ఫైటర్స్పై అండర్వాటర్లో యాక్షన్ సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఈ ఫైట్ సీక్వెన్స్లో రాయ్లక్ష్మీ కాలుకి గాయమైంది. ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ఆమె ప్రస్తుతం డిశ్చార్జ్ అయినట్లు చిత్రబృందం తెలిపింది. త్వరలో ఆమె తిరిగి షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు ప్రకటించింది.