మహబూబాబాద్ : ఉద్యోగం రాలేదన్న క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడిన సునీల్ నాయక్ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. సునీల్ నాయక్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన మంత్రులు ఈ సందర్భంగా మాట్లాడుతూ… బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు.
కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడంతో పాటు సునీల్ నాయక్ తల్లిదండ్రులకు గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా దహన సంస్కారాలకు లక్ష రూపాయల ఆర్థికసాయం అందజేస్తున్నట్లు చెప్పారు. సునీల్ లేని లోటు ఎవరూ తీర్చలేనిదైనా ఆయన కుటుంబానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.