నాగారం, మార్చి 29 : మండలంలోని ఫణిగిరి సీతారామచంద్రస్వామి ఆలయ వార్షికోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి స్వామివారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ హాజరై స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. ఆలయ అర్చకులు కూరేశం సంతోష్కుమారశర్మ, సాయి, చరణ్, మాధవాచార్యులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీరాముడు పెళ్లి కొడుకుగా, పెళ్లి కూతురిగా సీతాదేవిని అర్చకులు ముస్తాబు చేసి వేద మంత్రాలతో కల్యాణ తంతు జరిపించారు. అనంతరం స్వామి, అమ్మవారిని ముత్యాల పల్లకిలో కూర్చోబెట్టి ఊరేగింపు నిర్వహించారు. ఆలయంలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయించేందుకు ఎమ్మెల్యే రూ. 50వేలను ఆలయ చైర్మన్ సతీశ్కు అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ కురం మణీవెంకన్న, జడ్పీటీసీ కడియం ఇందిరాపరమేశ్వర్, సర్పంచ్ గట్టు నరసింహారావు, తిరుమలగిరి మార్కెట్ వైస్ చైర్మన్ గుండగాని అంబయ్య, మండలాధ్యక్షుడు కళ్లెట్లపల్లి ఉప్పలయ్య, శోభన్బాబు, పానగంటి నర్సింహారెడ్డి, పొదిళ్ల రమేశ్, ఎంపీటీసీలు జంపాల శోభారాణి, వడ్డె పరశురాములు, ఆలయ వైస్ చైర్మన్ మామిడి మల్లయ్య, డైరెక్టర్లు సల్ల రమేశ్, అంజయ్య, ఉపేందర్, లాజర్, యాదగిరి పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి..
ఏడుస్తుందని.. కంట్లో కారం కొట్టారు!
మెల్బోర్న్లో లాక్డౌన్.. ప్రేక్షకులు లేకుండానే ఆస్ట్రేలియన్ ఓపెన్