సడలింపు వేళల్లో భారీగా రద్దీ
మధ్యాహ్నం తర్వాత అంతా ఇండ్లకే పరిమితంనిర్మానుష్యం
కొనసాగుతున్న లాక్డౌన్
పకడ్బందీగా లాక్డౌన్
మహబూబ్నగర్, మే 16 : కరోనా నియంత్రణకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ జిల్లావ్యాప్తంగా పకడ్బందీగా కొనసాగుతున్నది. సడలింపు సమయంలో నిత్యావసర సరుకులు తీసుకునేందుకుగానూ ఆదివారం ప్రజలు అత్యధికంగా జిల్లా కేంద్రానికి చేరుకోవడంతో రద్దీ వాతావరణం కనిపించింది. లాక్డౌన్ నిబంధనలు పాటించని వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఉదయం 10 గంటల్లోపు ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఉరుకులు, పరుగులు తీశారు. రైతులు వ్యవసాయ పొలాల్లో బిజీబిజీగా గడిపారు.
ఐదోరోజూ బంద్ సంపూర్ణం
నాగర్కర్నూల్, మే 16: నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో ఐదోరోజు లాక్డౌడ్ సందర్భంగా బంద్ విజయవంతంగా సాగింది. ఆదివారం వ్యాపార సంస్థలకు వారాంతపు సెలవు కావడంతో ముందు మరింత పకడ్బందీగా లాక్డౌన్ కొనసాగింది. అన్ని వ్యాపార సంస్థలు మూసి ఉంటాయని తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పట్టణానికి తక్కువ సంఖ్యలో వచ్చినట్లు కనిపించింది. ఎక్కువశాతం శుభకార్యాలకు సంబంధించినవారు వచ్చి సడలింపు సమయంలో తమ పనులు పూర్తి చేసుకొని వెళ్లిపోయారు. పోలీసులు యథావిధిగా బందోబస్తు నిర్వహించారు.