ముంబై: మహారాష్ట్రలోని ముంబైకి చెందిన వ్యక్తి తనదైన శైలిలో వ్యాపారం చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. సైకిల్పై ఇంటింటికి తిరుగుతూ వేడివేడిగా పిజ్జా దోశలు వేసి కస్టమర్లకు అమ్ముతున్నాడు. ముంబైలోని పశ్చిమ మలాడ్ ప్రాంతంలో గత 25 ఏండ్లుగా సైకిల్పై చిరువ్యాపారంతో జీవనం గడుపుతున్నాడు.
సైకిల్పై ఏర్పాటు చేసిన పెన్నంపై వేడివేడిగా పిజ్జా దోశలు వేస్తాడు. తురిమిన పలు కూరగాయల ముక్కలు, జున్ను, సాస్ వంటివి వేసి ఎంతో రుచికరంగా తయారు చేస్తాడు. ఇవన్నీ కూడా తన సైకిల్పైనే తీసుకెళ్తాడు. వివిధ రకాల దోశలను రూ.60 నుంచి వంద వరకు విక్రయిస్తాడు.
గత 25 ఏండ్లుగా మలాడ్ వీధుల్లో సైకిల్పై దోశల వ్యాపారం చేస్తున్న అతడి గురించి ఆమ్చి ముంబై అనే యూట్యూబ్ ఛానల్ ఒక వీడియోను పోస్ట్ చేసింది. దీనిని ఇప్పటి వరకు కోటి మందికిపైగా వీక్షించారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపించారు.