రాయ్పుర్: రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ20 సిరీస్ ఫైనల్ మ్యాచ్లోనూ ఆల్రౌండర్లు యువరాజ్ సింగ్(60: 41 బంతుల్లో 4ఫోర్లు,4సిక్సర్లు), యూసుఫ్ పఠాన్(62 నాటౌట్: 36 బంతుల్లో 4ఫోర్లు, 5సిక్సర్లు) వీరవిహారం చేశారు. జట్టు క్లిష్టపరిస్థితుల్లో ఉండగా క్రీజులోకి వచ్చిన యువీ బౌండరీల మోత మోగించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
పఠాన్ ఆఖర్లో విజృంభించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా లెజెండ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 181 పరుగులు చేసింది. ఇండియా ఇన్నింగ్స్ ఆరంభంలో కెప్టెన్ సచిన్ టెండూల్కర్(30: 23 బంతుల్లో 5ఫోర్లు) ఆకట్టుకున్నాడు. తుదిపోరులో డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(10), ఎస్ బ్రదినాథ్(7) విఫలమయ్యారు. లంక బౌలర్లలో రంగన హెరాత్, సనత్ జయసూర్య , పర్వేజ్ మహరూఫ్, వీరరత్నె తలో వికెట్ పడగొట్టారు.