విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. పూరి కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్లో ప్రత్యేక శిక్షణ తీసుకున్న విషయం తెలిసిందే. ముంబయిలో తీర్చిదిద్దిన భారీ సెట్లో ఇటీవలే ఈ సినిమా ఓ షెడ్యూల్ను పూర్తిచేసుకుంది. ఇందులో కీలకమైన పోరాట ఘట్టాల్ని తెరకెక్కించారు. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ ఆండీలాంగ్ నిర్దేశకత్వంలో ఈ ఫైట్ సీక్వెన్స్ను తెరకెక్కించారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆండీలాంగ్ విదేశీబృందం ఈ యాక్షన్ సన్నివేశాల రూపకల్పనలో పాలుపంచుకుంది. ‘జాకీచాన్తో పాటు అనేక హాలీవుడ్ ప్రముఖులతో పనిచేసిన ఆండీలాంగ్ పర్యవేక్షణలో రూపొందించిన యాక్షన్ సీన్స్ సినిమాలో ప్రధానాకర్షణగా ఉంటాయి’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: విష్ణుశర్మ, నిర్మాతలు: కరణ్జోహార్, పూరి జగన్నాథ్, ఛార్మికౌర్, అపూర్వమెహతా, హిరూ యశ్జోహార్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్.