కోదాడ/మునగాల/మోతె, ఏప్రిల్ 18 : కల్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డలకు వరమని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం అనంతగిరి తాసీల్దార్ కార్యాలయంలో 110మంది లబ్ధిదారులకు రూ.1,10,12,760 కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఆడబిడ్డల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అమ్మఒడి, కేసీఆర్ కిట్ లాంటి పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఎంపీపీ చుండూరు వెంకటేశ్వర్లు, తాసీల్దార్ విజయలక్ష్మి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గింజుపల్లి రమేశ్, సర్పంచులు, ఎంపీటీసీలు, సహకార సంఘాల చైర్మన్లు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మునగాల మండలం గణపవరం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ నెమ్మాది వెంకయ్య ఇటీవల మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యులను, టీఆర్ఎస్ నాయకుడు గౌని శ్రీనివాస్ తల్లి రాజమ్మ మృతిచెందగా ఆమె కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. ఆయన వెంట పీఏసీఎస్ చైర్మన్ కందిబండ సత్యనారాయణ, టీఆర్ఎస్ నాయకులు కేతిరెడ్డి సత్యనారాయణరెడ్డి, గుండెల సూర్యనారాయణ, కొండపల్లి నర్సింహారావు తదితరులు ఉన్నారు. మోతె మండలం విభలాపురం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ జిల్లా నాయకుడు మైనంపాటి మల్లారెడ్డి ఇటీవల మృతి చెందగా ఆయన భార్య, వైస్ ఎంపీపీ సునీతను ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్ పరామర్శించారు. ఆయన వెంట జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, జడ్పీటీసీ పుల్లారావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శీలం సైదులు, రైతుబంధు సమితి మండల కన్వీనర్ గురువారెడ్డి, సర్పంచ్ వీరస్వామి, ఎంపీటీసీ వెంకన్న తదితరులు ఉన్నారు.