వాషింగ్టన్: కోవిడ్ వ్యాధి తీవ్రంగా సోకిన వారిలో.. మానసిక రుగ్మతలు ఉత్పన్నమవుతున్నట్లు అమెరికాలో నిర్వహించిన ఓ అధ్యయనం ద్వారా తెలిసింది. మహమ్మారి మొదలైన తొలి రోజుల్లో సుమారు 150 మంది కోవిడ్ రోగులపై స్టడీ చేశారు. అయితే ఆ అధ్యయనంలో సుమారు 73 మందికి మానసిక సమస్యలు ఉత్పన్నమైనట్లు తేలిందన్నారు. మానసిక స్థితిలో తీవ్రమైన చలనం జరుగుతున్నట్లు గుర్తించారు. కోవిడ్ సోకిన వ్యక్తి ఆందోళనకు గురికావడం, మతిమరుపుకు లోనుకావడం, అస్పష్టంగా మాట్లాడడం లాంటి కేసులు నమోదు అయినట్లు తెలిపారు. బీఎంజే ఓపెన్ జర్నల్లో ఆ స్టడీకి చెందిన నివేదికను పబ్లిష్ చేశారు. డెలీరియం లాంటి మానసిక వ్యాధి వల్ల ఆ వ్యక్తులు బలహీనపడుతారని, వారిల్లో హైబీపీ, డయాబెటిస్ లక్షణాలు కూడా ఉంటాయని ఆ స్టడీలో తేల్చారు. మిచిగన్ యూనివర్సిటీకి చెందిన రచయిత ఫిలిప్ విసైడ్స్ ఈ రిపోర్ట్ను పొందుపరిచారు. డెలీరియం వ్యాధిగ్రస్తుల మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుందని, దీని వల్ల రక్తం గడ్డకట్టడం లేదా స్ట్రోక్ రావడం జరుగుతుందని పరిశోధకులు చెప్పారు. మెదడులో వాపు కూడా వస్తుందని, అలాంటి వారిలో ఆందోళన, చికాగు ఎక్కువగా ఉంటాయన్నారు.