తిరువనంతపురం : కొవిడ్ నేపథ్యంలో ఆక్సిజన్ అందించే కార్యక్రమంలో భాగంగా కొట్టాయం జిల్లా వ్యాప్తంగా ఆక్సిజన్ పార్లర్ను జిల్లా యాంత్రాంగం అందుబాటులోకి తేనుంది. మనార్కడ్లోని సెయింట్ మేరీ చర్చి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్లో మొదటి పార్లర్ను అధికారులు బుధవారం ప్రారంభించారు. జిల్లా పోలీసు చీఫ్ శిల్పా దేవయ్య సమక్షంలో మనార్కాడ్లోని ఆక్సిజన్ పార్లర్ను జిల్లా కలెక్టర్ ఎం.అంజనా ప్రారంభించారు.
జిల్లాలో కొవిడ్ పాజిటివ్ కేసులు ఆకాశాన్నంటున్న తరుణంలో హోం ఐసోలేషన్లో ఉన్న రోగులు రక్తంలో ఆక్సిజన్ స్థాయిని తనిఖీ చేసేందుకు అదేవిధంగా ఈ కేంద్రాల నుండి అవసరమైతే ఆక్సిజన్ను పొందేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆక్సిజన్ స్థాయిలో ఆకస్మిక మార్పు ఉంటే చికిత్స ఆలస్యం అయ్యే ప్రమాదాన్ని తగ్గించేందుకు ఈ పార్లర్ సహాయపడుతుందని కలెక్టర్ చెప్పారు.
ఇంట్లో ఉండే కొవిడ్ రోగులు కొవిడ్ ప్రోటోకాల్కు కట్టుబడి పార్లర్కు వచ్చి పరీక్షలు చేయించుకొని అవసరమైతే ఆక్సిజన్ను పొందవచ్చు. రోజులో ఎప్పుడైనా ఆక్సిజన్ను అందించగల సామర్ధ్యం ఈ పార్లర్ సొంతం. ఇది నిమిషానికి ఐదు లీటర్ల ఆక్సిజన్ (93 శాతం) ఇవ్వగలదు. వాతావరణం నుండి ఆక్సిజన్ను నిల్వ చేస్తుంది కావునా స్టాక్ అయిపోయే పరిస్థితి తలెత్తదు.