జకార్తా : ఆనందమయమైన క్షణాలను తీపిగుర్తులుగా మిగుల్చుకుందామనుకున్న ఓ బృందానికి జీవితాల చేదు గుర్తులు మిగిలాయి. ఇండోనేషియాలో పడవ బోల్తా పడిన ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు వ్యక్తులు మరణించారు. సెంట్రల్ జావా ద్వీపంలోని బోయొలాలి ప్రాంతంలోని రిజర్వాయర్లో 20 సభ్యుల పర్యాటక బృందం పడవలో అలా జాలీ ట్రిప్కు వెళ్లింది. ఆనందంగా గడుపుతుండగా అందరూ కలిసి ఓ సెల్ఫీ తీసుకోవాలని భావించారు. దీంతో సెల్ఫీ కోసం అందరూ పడవలో ఒకే వైపుకు రావడంతో ఓవర్లోడ్ అయి పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఇండోనేషియా పౌరులు ఏడుగురు మరణించారు. రెస్క్యూ సిబ్బంది 11 మందిని రక్షించారు. మరో ఇద్దరి జాడ తెలియకుండా పోయింది. వీరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.