దేశంలోని 6 వేల రైల్వే స్టేషన్లలో ఇండియన్ రైల్వే ఉచితంగా వైఫై సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఝార్ఖండ్లోని హజారిబాగ్ టౌన్లో శనివారం ఫ్రీ వైఫై సేవలు ప్రారంభంకావడంతో దేశవ్యాప్తంగా ఉచిత వైఫై సేవలు అందిస్తున్న రైల్వే స్టేషన్ల సంఖ్య 6వేలకు చేరింది. భారత రైల్వే సంస్థ 2016లో ముంబై రైల్వే స్టేషన్లో మొదటి వైఫై సదుపాయాన్ని ఏర్పాటు చేసింది.
ఆ తర్వాత పశ్చిమ బెంగాల్లోని మిడ్నాపూర్ వద్ద 5000వ స్టేషన్కు ఈ సౌకర్యాన్ని విస్తరించింది.
వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) ఆధారిత ధ్రువీకరణతో స్టేషన్లో ఉన్నవారెవరైనా ఇంటర్నెట్ సేవలను ఉపయోగించుకోవచ్చు. రైల్వే ప్రయాణికులకు వేగవంతమైన ఇంటర్నెట్ అందించడమే లక్ష్యంగా వైఫై సేవలను సంస్థ అందిస్తోంది.