అమరావతి: రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కు కాబోయే సీఎం పవన్ కల్యాణే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు.
‘జరుగుతున్నది తిరుపతి లోక్సభ స్థానం ఉపఎన్నిక. కాబోయే సీఎం ఫలానా అంటూ బిస్కట్ వేయడం కాక మరేమిటి? ఆఫర్ చేసే పార్టీకి రాష్ట్రంలో ఒక్క సీటు లేదు. దానిని తీసుకునే పార్టీకి ఉనికి లేదు. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందట. కనీసం ఎమ్మెల్యే కూడా కాని వాడు ఏకంగా సీఎం కుర్చీ ఎక్కుతాడట!’ అంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
‘విజయ్ మాల్యా బ్యాంకులకు 9 వేల కోట్లు బాకీపడి లండన్ పారిపోయాడు. ట్రాన్స్ ట్రాయ్ పేరుతో 10 వేల కోట్లు బ్యాంకుల లూటీకి పాల్పడిన టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి మాత్రం దొరలా తిరుగుతున్నాడు. బ్యాంకుల నుంచి లూటీ చేసిన మొత్తంలో సగం చంద్రబాబే నొక్కేశాడు. దర్యాప్తులో జాతకాలు అన్నీ బయటికొస్తాయి’ అంటూ విజయసాయిరెడ్డి హెచ్చరించారు.