న్యూఢిల్లీ: భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఐడీసీఎల్)లో ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 61 పోస్టులను భర్తీచేయనుంది. అయితే అవసరాన్నిబట్టి పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. భారత్ మాల ప్రాజెక్టులో భాగంగా ఈశాన్య భారతదేశంలో, పొరుగు దేశాలతో అంతర్జాతీయ సరిహద్దులు పంచుకునే ప్రాంతాల్లో జాతీయ రహదారులను నిర్మించడంలో భాగంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. ఎంపికైన అభ్యర్థులు లఢక్, ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవులు, జమ్ముకశ్మీర్లోని ఎన్హెచ్ఐడీసీఎల్ ప్రాంతీయ కార్యాల్లో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 61
ఇందులో జనరల్ మేనేజర్ (పోస్టుల సంఖ్య పేర్కొనలేదు), డిప్యూటీ జనరల్ మేనేజర్ 25, మేనేజర్ 26, అసిస్టెంట్ మేనేజర్ 2, జూనియర్ మేనేజర్ 8 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ కానీ బీటెక్, బీఈ చేసి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 31
వెబ్సైట్: www.nhidcl.com
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..