అమరావతి : అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి చికిత్స కోసం దవాఖానకు వచ్చి అక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లా ఆదోని మండలం మదిరె గ్రామంలో ఈ ఘటన జరిగింది. మదిరె గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రెండురోజులుగా జ్వరం, ఆయాసంతో బాధపడుతున్నాడు.
చికిత్స నిమిత్తం ఇవాళ మధ్యాహ్నం స్థానిక ఏరియా దవాఖానకు వచ్చాడు. కాసేపటికి పరిస్థితి విషమించి దవాఖానలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనతో దవాఖానలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులతోపాటు దవాఖాన సిబ్బంది తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. మృతుడికి కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.