న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్.. ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణకు సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు కనిపిస్తున్నది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ రూ.1.75 లక్షల కోట్ల మేరకు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వాటాల ఉపసంహరణ ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని లక్ష్యాన్ని నిర్దేశించారు.
డిజిన్వెస్ట్మెంట్ టార్గెట్ ఓకే
ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణపై కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణ్యం స్పందించారు. ప్రభుత్వ లక్ష్యం తప్పనిసరిగా సాధించదగిందన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ బీమా సంస్థ (ఎల్ఐసీ) నుంచే సుమారు రూ. లక్ష కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూర్చి పెడుతుందని శనివారం ఓ వర్చువల్ సదస్సులో మాట్లాడుతూ చెప్పారు.
ఐపీవో ద్వారా ఎల్ఐసీ నిధుల సేకరణ
ఇన్షియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) ద్వారా ఎల్ఐసీ వాటాల ఉపసంహరణకు వెళుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న రూ.2.10 లక్షల కోట్ల వాటాల ఉపసంహరణ లక్ష్యాన్ని 2021-22 ఆర్థిక సంవత్సరంలో ముందుకు తీసుకెళుతున్నామని సుబ్రమణ్యం వెల్లడించారు.
బీపీసీఎల్, ఎల్ఐసీ కీలకం
భారత్ పెట్రోలియం కంపెనీ లిమిటెడ్ (బీపీసీఎల్) ప్రైవేటీకరణ, ఐపీవోలో ఎల్ఐసీ లిస్టింగ్ వంటి అంశాలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ వాటాల ఉపసంహరణ లక్ష్యాలను చేరుకోవడంలో ముఖ్యమైన కంట్రిబ్యూటర్లు అని సుబ్రమణ్యం తెలిపారు. బీపీసీఎల్ ప్రైవేటీకరణ ద్వారా రూ.75-80 వేల కోట్లు, ఎల్ఐసీ ఐపీవో ద్వారా రూ. లక్ష కోట్ల మేరకు ఆదాయం లభిస్తుందని అంచనా వేశారు.
బీపీసీఎల్లో 52.98 శాతం వాటా విక్రయం
బీపీసీఎల్లో కేంద్ర ప్రభుత్వం 52.98 శాతం వాటాలను విక్రయించనున్నది. ఇప్పటివరకు కేంద్రం చేపట్టిన ప్రైవేటీకరణలో అతిపెద్ద ప్రాజెక్టు బీపీసీఎల్దే. దీని కొనుగోలు కోసం వేదంతాగ్రూప్, అపొలో గ్రూప్ అనే ప్రైవేట్ సంస్థ, ఐ స్క్వేర్డ్ క్యాపిటల్స్ ఇండియా యూనిట్ థింక్ గ్యాస్ కూడా బిడ్లు దాఖలు చేశాయి. మరోవైపు ఎల్ఐసీని ఐపీవోలోకి వెళ్లేందుకు ఇటీవలే కేంద్రం ప్రతిపాదించిన చట్ట సవరణకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది.
క్రిప్టో కరెన్సీపై నిషేధం వద్దు : కేంద్రానికి ఇద్దరు పారిశ్రామికవేత్తల వినతి
మీడియా, వినోద రంగం కోలుకున్నట్టే
పీఎంసీ బ్యాంకులో జూన్ వరకూ ఆంక్షలు.. ఎందుకంటే..
ప్రభుత్వ బ్యాంకులకే మొండి బాకీల సమస్య!
చౌకగా ఇచ్చే వారివద్దే చమురు కొనుగోలు!