మాస్కో: రష్యాకు చెందిన ఏఎన్-28 ప్రయాణికుల విమానం శుక్రవారం అదృశ్యమైంది. 13 మంది ప్రయాణికులున్న ఈ విమానం సైబీరియా ప్రాంతం సమీపంలో మిస్ అయ్యిందని రష్యా వైమానిక అధికారులు వెల్లడించినట్లు స్థానిక వార్తా సంస్థలు పేర్కొన్నాయి. మరోవైపు ఆ విమానంలో 17 మంది ఉన్నట్లు ఆర్ఐఏ నోవోస్టి ఏజెన్సీ తెలిపింది. కాగా, రష్యా విమానం మిస్సింగ్కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.