హైదరాబాద్ : నేలతల్లి బాగుంటేనే.. మనం బాగుంటాం. భావి తరాలు బాగుంటాయని అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పుడమి తల్లి మన అవసరాలను తీర్చగలదు గానీ అత్యాశలను ఎంతమాత్రం తీర్చలేదని ఆనాడు గాంధీజీ చెప్పిన మాటలు అక్షర సత్యాలని అన్నారు. కాలుష్యం వల్ల ఓజోన్ పొర క్షీణిస్తొందన్నారు.
భూమాతకు ఎటువంటి హానీ కలుగకుండా కాపాడుకోవాలని ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి ఓ ప్రకటనలో కోరారు. భూమిని కాపాడుకోవటానికి పర్యావరణం, వాతావరణంతోపాటు మానవుని జీవనశైలిలో మార్పు రావాలని సూచించారు.
భూమిపై లభించే సహజ వనరులను మనం ఇష్టానుసారంగా వినియోగించడం వల్ల పర్యావరణానికి హానీ జరుగుతోందని వెల్లడించారు.
పూడమి తల్లిని కాపాడుకునేందుకు మనవంతు బాధ్యతగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు.
మనిషి బతికేందుకు కావాల్సిన ఆక్సిజన్ను పొందడానికి చెట్లు చాలా అవసరమని వాటి ప్రాముఖ్యతను గుర్తించిన సీఎం కేసీఆర్ హరితహారంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు.
అడవుల రక్షణ, వన్యప్రాణులు, జీవ వైవిధ్య సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు.
ఇవి కూడా చదవండి..
రష్యా తురుపుముక్క లెనిన్.. చరిత్రలో ఈరోజు
ఒకే దేశంలో వ్యాక్సిన్కు రెండు ధరలా?