న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు కొవిడ్ -19 నిబంధనలకు అనుగుణంగా జరుగుతున్నాయి. ఇంటర్నేషన్ యోగా డే దినోత్సవాన్ని పురస్కరించుకుని లఢక్లో మైనస్ టెంపరేచర్లో ఓ ఐటీబీపీ ఆఫీసర్ సూర్య నమస్కారాలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ఐటీబీపీ జవాన్లు అందరూ అతిశీతల ఉష్ణోగ్రతల్లోనూ యోగా ఆసనాలు వేశారు.