హైదరాబాద్ : ఈస్టర్ సందర్భంగా క్రిస్టియన్ సోదర సోదరీమణులకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని సనత్నగర్ బాప్టిస్ట్ చర్చిలో ఈస్టర్ ఉత్సవాల్లో మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లోక కల్యాణం కోసం యేసు మళ్లీ వచ్చిన రోజు. ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తుంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ రోజు మనం ఈస్టర్ సంబరాలు జరుపుకుంటున్నాము. మీ సమస్యలపట్ల ముఖ్యమంత్రి పూర్తి నిబద్దతతో ఉన్నారు. స్మశానవాటికల సమస్య మీద సీఎం ఆలోచన చేస్తున్నారు. తెలంగాణలో అన్ని మతాల వారు సామరస్యంతో ఉన్నారు. అందరి విశ్వాసాలు గౌరవిస్తున్న, అందరి పండుగలు జరుపుతున్న రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు.