రాయ్పూర్ : 45 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేయించుకోవాలని అటు కేంద్రం, ఇటు రాష్ర్ట ప్రభుత్వాలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న విషయం విదితమే. కొందరు టీకా వేయించుకోకుండా నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి వారిని ఆకర్షించేందుకు అధికారులు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు.
ఛత్తీస్గఢ్ బీజాపూర్ మున్సిపాలిటీ పరిధిలో కరోనా టీకాపై ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. టీకా వేయించుకొని.. టమాటాలను ఉచితంగా తీసుకెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. దీంతో టీకా వేయించుకునేందుకు మహిళలు ఆసక్తి చూపుతున్నట్లు కొవిడ్ టీకా సెంటర్ అధికారి పురుషోత్తం సల్లూరు తెలిపారు. ఈ వినూత్న ప్రయోగం వల్ల రైతులకు కూడా మేలు జరుగుతుందన్నారు. వారు పండించే టమాటాను మున్సిపాలిటీకి అప్పగించాలని కోరినట్లు ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి..