సాధారణంగా కనిపించే కొన్ని వస్తువులు ఉన్నట్టుండి అమూల్యమైనవిగా మారిపోతాయి. దానికి సరైన ఉదాహరణ 1933 నాటి 20 డాలర్ల ‘డబుల్ ఈగల్’ అమెరికన్ గోల్డ్ కాయిన్. ఈ నాణేన్ని ముద్రించినప్పుడు దీని విలువ 20 డాలర్లు (ప్రస్తుతం రూ. 1460). అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డీ. రూజ్వెల్ట్ బంగారు నాణేల మద్రణను నిలిపివేయడంతో ఈ నాణాల చలామణి ఆగింది. 1933లో ముద్రించిన ఓ 20 డాలర్ల బంగారు నాణేన్ని ఇటీవల వేలం వేయగా, అది 18.9 మిలియన్ డాలర్లు (రూ. 138 కోట్లు) పలికింది. అలా ప్రపంచంలోనే విలువైన నాణెంగా ఇది రికార్డును సృష్టించింది.