న్యూఢిల్లీ, మే 13: దేశంలో అతిపెద్ద స్టాక్ ఎక్సేంజ్లలో ఒకటైన బీఎస్ఈ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.31.75 కోట్ల లాభాన్ని గడించింది. 2019-20 ఏడాది ఇదే సమయంలో రూ.1.91 కోట్ల నష్టాన్ని నమోదు చేసుకున్నది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 27 శాతం పెరిగి రూ.152.18 కోట్లకు ఎగబాకింది. గత ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.21 తుది డివిడెండ్ను బోర్డు ప్రతిపాదించింది.