కుత్బుల్లాపూర్, జూన్ 21 : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, కాలనీల్లోని మౌలిక సదుపాయాలను పూర్తిస్థాయిలో కల్పించి భవిష్యత్కాలంలో ఎలాంటి సమస్యలు లేకుండా సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. సోమవారం జీడిమెట్ల డివిజన్ పరిధిలోని రంగారెడ్డిబండ, యాదిరెడ్డిబండలో అధికారులతో కలిసి పర్యటించారు. నూతనంగా వేసిన రోడ్లను పరిశీలించిన అనంతరం ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు లేవనెత్తిన కరెంటు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రంగారెడ్డిబండలో సర్వే నంబర్ 25/1లో ఉన్న 5.15 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ట్రాఫిక్ పోలీస్స్టేషన్, వాటర్వర్క్ ఆఫీస్, కమిటీహాల్ వంటి ఏర్పాటుకు స్థలాన్ని వినియోగించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఈఈ కృష్ణచైతన్య, డీజీఎం రాజేశ్, ఎలక్ట్రికల్ ఏఈ ఇంద్రసేనారెడ్డి, ఏఈ సురేందర్నాయక్, నాయకులు సాయికిరణ్గౌడ్, కొండయ్య, శ్రీను, ఇందిరా, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
జీడిమెట్ల డివిజన్ కుత్బుల్లాపూర్ గ్రామంలో బీరప్ప ఆలయ కురుమ సంఘం నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. నగర ప్రజలకు వాటర్ కనెక్షన్ గృహ వినియోగదారులకు ప్రభుత్వం నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటిని అందిస్తున్న నేపథ్యంలో బల్క్ సప్లయర్స్, ఆయా కాలనీలవాసులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.