లండన్: రాయిటర్స్ అంతర్జాతీయ వార్తా సంస్థ కొత్త అధ్యాయానికి తెరలేపింది. ఆ సంస్థ చీఫ్ ఎడిటర్గా మహిళకు బాధ్యతలు అప్పగించారు. రాయిటర్స్ సంస్థలో ఎడిటర్గా చేస్తున్న అలెగ్జాండ్రా గల్లొనిని చీఫ్ ఎడిటర్గా ఎంపిక చేశారు. 170 ఏళ్ల చరిత్ర ఉన్న రాయిటర్స్ వార్తా సంస్థలో మహిళా జర్నలిస్టు చీఫ్ ఎడిటర్ కావడం ఇదే మొదటిసారి. ప్రస్తుత ఎడిటర్ స్టీఫెన్ జే అడ్లర్ స్థానంలో రోమ్కు చెందిన 47 ఏళ్ల గల్లొని బాధ్యతలు స్వీకరించనున్నారు. గత దశాబ్ధ కాలం నుంచి విధులు నిర్వర్తిస్తున్న స్టీఫెన్ ఈ నెల చివర్లో రిటైర్కానున్నారు. ఆయన సారథ్యంలో రాయిటర్స్ వార్తా సంస్థ అనేక జర్నలిజం అవార్డులను గెలుచుకున్నది. ఏడు పులిట్జర్ అవార్డులు గెలుచుకోవడం విశేషం. అలెగ్జాండర్ గల్లొని నాలుగు భాషలు మాట్లాడగలదు. వ్యాపార, రాజకీయ వార్తాలను కవర్ చేసిన అనుభవం ఉన్నది. గతంలో వాల్ స్ట్రీట్ జర్నల్లో పనిచేశారామె. రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీకి ప్రపంచ వ్యాప్తంగా 2450 మంది జర్నలిస్టులు, 600 మంది ఫోటో జర్నలిస్టులు ఉన్నారు. 1851లో పాల్ రాయిటర్స్ అనే వ్యక్తి లండన్లో ఈ సంస్థను స్థాపించాడు.